Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

Advertiesment
victim
కొడుకుపై కన్నతల్లి క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. సొంత మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని పేర్కొంటూ తన కుమారుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... జిల్లాలోని భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రికి చెడు అలవాట్లు ఉండటంతో బాగోగులు చూసేవారు లేక తన మేనత్త ఇంట్లోనే ఉంటూ పెరిగింది. అయితే, ఇదే అదునుగా భావించిన ఆమె కుమారుడు, బాలికను మాయమాటలతో లోబర్చుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ క్రమలో బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భయపడుతూనే జరిగిన విషయాన్ని తన అత్తకు వివరించింది. దీంతో ఆమె.. మేనకోడలికి జరిగిన అన్యాయం తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కన్న కొడుకని కూడా చూడకుండా బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించింది. 
 
కన్నకొడుకుపై ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు