Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్కులు ఎక్కువ వేస్తానని బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం.. వీడియో తీసి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారిపోయాడు. తన వద్ద చదువుకునే ఓ దళిత బాలికకు అధిక మార్కులు వేస్తానని చెప్పి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అంతటితో వదిలిపెట్టని ప్రిన్సిపాల్.. వీడియో తీస

మార్కులు ఎక్కువ వేస్తానని బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం.. వీడియో తీసి...
, సోమవారం, 10 జులై 2017 (09:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారిపోయాడు. తన వద్ద చదువుకునే ఓ దళిత బాలికకు అధిక మార్కులు వేస్తానని చెప్పి తన కామవాంఛ తీర్చుకున్నాడు. అంతటితో వదిలిపెట్టని ప్రిన్సిపాల్.. వీడియో తీసి దాన్ని వాట్సాప్‌లో పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర శివార్లలోని సాధాన్ గ్రామంలో ఉన్న శ్రీమతి బదామీదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. ఇందులో ప్రిన్సిపాల్‌గా జవహర్ సింగ్ పని చేస్తున్నాడు. ఈయన తన వద్ద ఏడో తరగతి చదువుతున్న ఓ దళిత బాలికను కార్యాలయానికి పిలిచాడు. పరీక్షల్లో అధిక మార్కులు వేస్తానని బాలికకు ఆశ పెట్టి ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే ఆమెను లైంగికంగా వేధించాడు.
 
స్కూలు పనివేళల్లోనే ప్రిన్సిపాల్ తన గదిలో బాలికను బలవంతంగా పట్టుకొని లైంగికంగా వేధించాడు. మూడు నిమిషాల నిడివి గల ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. ఈ విషయం బాధిత బాలిక తండ్రికి చేరింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కామాంధుడైన ప్రిన్సిపాల్‌పై ఐపీసీ సెక్షన్ 354, ఐటీ యాక్ట్ 67బి, ఎస్సీ, ఎస్టీ, పోస్కో చట్టాల కింది కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారాలకు నిలయంగా మారిన ఢిల్లీ.. ఇద్దరు మైనర్లు.. మతిస్థిమితం లేని మహిళపై?