సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దేశంలోని మహిళలనే కాకుండా విదేశాల నుంచి వచ్చే మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా సాధువు అవతారం ఎత్తిన మృగాడు ఓ విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్లోని వృందావన్కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారం జరిపాడు. ఆమెను తీవ్రంగా కొట్టి మరి లైంగికదాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. కృష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన ఆమె గత ఫిబ్రవరి 26న హోళీ ఉత్సవాల కోసం వృందావన్కు వచ్చి ఓ గెస్ట్ హౌస్లో దిగింది.
తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం తీవ్రగాయాలై స్పృహకోల్పోయిన ఆమెను పోలీసులు గుర్తించారు. చికిత్స అనంతరం మెలకువలోకొచ్చిన ఆమె తులసీమాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె తెలిపిన వివరాల మేరకు సాధువు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.