Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు రాష్ట్రాలకు నష్టమే... వెనుకబడ్డాయి.

రెండు రాష్ట్రాలకు నష్టమే... వెనుకబడ్డాయి.
, గురువారం, 2 ఏప్రియల్ 2015 (07:15 IST)
దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరిగిందని, విభజన ఆ పరిస్థితికి కారణమయ్యిందనీ,కేంద్ర నిధులు కూడా వినియోగించుకోలేకపోయాయని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. తాము ఆ రెండు రాష్ట్రాలను ఆదుకుంటామని హామీయిచ్చారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
 
ఏపీకి గతేడాదికి సంబంధించి రూ.250 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు. మార్చి 31లోగా ఈ నిధులు రాష్టానికి అందేలా చూశామన్నారు. పోలవరంకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని చెప్పారు. ఏపీకి న్యాయం జరగకుండానే విభజన జరిగిపోయింది. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అధ్యయన బృందం నివేదిక ఇచ్చిందన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం హామీయిచ్చిందని తెలిపారు. విజయవాడలో సముద్ర, భూగర్భ కాల్వల నిర్వహణకు రూ. 461 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu