ఐదుగురు నిందితులు రేప్ చేస్తుంటే.. మా ఫ్రెండ్స్ గుడ్లప్పగించి చూశారు...
ఢిల్లీలోని అమన్ విహార్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితులైన 17, 18 ఏళ్ల బాలికలు పోలీసుల ముందు వాంగ్మూలమిచ్చారు. ఈ వాంగ్మూలంలో వారు తన స్నేహితులపై సంచలన ఆరోపణలు చేశారు. తమపై ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచా
ఢిల్లీలోని అమన్ విహార్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితులైన 17, 18 ఏళ్ల బాలికలు పోలీసుల ముందు వాంగ్మూలమిచ్చారు. ఈ వాంగ్మూలంలో వారు తన స్నేహితులపై సంచలన ఆరోపణలు చేశారు. తమపై ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేస్తుంటే... మాతో వచ్చిన మా బాయ్ఫ్రెండ్స్ మౌన ప్రేక్షకుల్లాగా చూస్తుండిపోయారనీ, వారు పెద్దగా అరచి మమ్మల్ని కాపాడుతారని మేం భావించామని, కానీ వారు ఓ మూలన కూర్చొని తమపై సాగుతున్న దురాగతాన్ని గుడ్లప్పగించి చూస్తుండిపోయారనీ చెప్పుకొచ్చారు.
ఓ బాయ్ఫ్రెండ్ అయితే కనీసం తమపై జరిగిన దారుణ ఘటన గురించి పోలీసులకు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించాడని బాధితులు ఆవేదనగా చెప్పారు. బాయ్ ఫ్రెండ్స్ గురించి బాధితులు పోలీసులకు చెప్పిన మాటలు సంచలనం రేపాయి. ఈ కేసులో నిందితులైన ఇద్దరు మైనర్ బాలురతోపాటు మనీష్ (19), శివం (19)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.