Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రమంత్రి ఔదార్యం.. తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు!

కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానిక

కేంద్రమంత్రి ఔదార్యం.. తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు!
, సోమవారం, 7 నవంబరు 2016 (08:37 IST)
కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా ఔదార్యం ప్రదర్శించారు. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన అదే విమానంలో సాధారణ వ్యక్తిలా మరో సీటులో కూర్చొని తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇంతకీ ఆ మహిళకు మంత్రి తన ఫస్ట్ క్లాస్ సీటును ఎందుకిచ్చారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి అదే విమానంలో ప్రయాణిస్తోంది. తల్లి కాలికి దెబ్బతగలడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీనికితోడు విమానంలో వారికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో అందులో కూర్చునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడింది. 
 
ఆ మహిళ అవస్థను గమనించిన శ్రేయ.. అదేవిమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి, తమ సీట్లోకి వెళ్లి ఆ సీటును ఇవ్వాల్సిందిగా కోరింది. మంత్రి మరేమీ మాట్లాడకుండా భార్యతో కలిసి సీట్లు మారి వారికి తమ సీట్లను అప్పగించారు. మంత్రి చేసిన సాయాన్ని శ్రేయ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిన్హాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి 'యు ఆర్ వెరీ వెల్‌కమ్' అని రీట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకిలెక్కేందుకు చిరంజీవి సిద్ధం.. అయితే, కండిషన్స్ అప్లై...