Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి మహిళాభక్తుల ప్రవేశం! 6-7 గంటల మధ్యలోనే?!

త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి మహిళాభక్తుల ప్రవేశం! 6-7 గంటల మధ్యలోనే?!
, శనివారం, 16 ఏప్రియల్ 2016 (10:26 IST)
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి మహిళాభక్తుల ప్రవేశంపై శతాబ్ధాలుగా నెలకొన్న ఆంక్షలు తొలగిపోయాయి. ద్వాదశ జోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని నిబంధనలు విధించింది.

పురుష భక్తుల మాదిరిగానే ప్రతిరోజు ఓ గంటపాటు ఉదయం 6 నుంచి 7గంటల మధ్య గర్భగుడిలోకి అనుమతి ఉంటుందని, అలాగే తడి బట్టలు లేదంటే సిల్క్‌ వస్త్రా‌లు ధరించిన మహిళలనే అనుమతిస్తామని ట్రస్ట్‌ స్పష్టం చేసింది. 
 
కాగా ఈ నిబంధనను పుణెకు చెందిన స్వరాజ్‌ సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తే తీవ్రంగా వ్యతిరేకించారు. గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలంటూ ఆందోళనలను నిర్వహిస్తున్న వనిత.. తన సభ్యులతో కలిసి గురువారం త్రయంబకేశ్వర్‌కు చేరుకున్నారు.

అయితే షరతులతో కూడిన ఆలయ ప్రవేశాన్ని ఆమె తిరస్కరించారు. ఆలయ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు ఆలయ నిర్వాహకులు సహా 250 మందిపై కేసు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu