Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మావోలపై కాల్పులు : ముగ్గురు జవాన్లకు గాయాలు!

మావోలపై కాల్పులు : ముగ్గురు జవాన్లకు గాయాలు!
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:27 IST)
మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్గఢ్ దంతెవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసు అధికారుల కథనం ప్రకారం కూంబింగ్లో పాల్గొని సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఆ దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

Share this Story:

Follow Webdunia telugu