Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెమన్‌ ఉరిశిక్షను రద్దు చేయమని కోరినవారంతా దేశ ద్రోహులే : శివసేన

మెమన్‌ ఉరిశిక్షను రద్దు చేయమని కోరినవారంతా దేశ ద్రోహులే : శివసేన
, శనివారం, 1 ఆగస్టు 2015 (10:20 IST)
ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసులో దోషి యాకుబ్ మెమన్‌కు పడిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరినవారిపై శివసేన మండిపడింది. ఇలాంటి వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
 
కాగా, యాకుబ్ మెమన్‌కు జూలై 30వ తేదీన ఉరిశిక్షను అమలు చేసిన విషయంతెల్సిందే. అయితే, ఉరిశిక్ష అమలు చేయవద్దంటూ అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభిప్రాయపడ్డారు. 
 
దీనిపై శివసేన మండిపడింది. మెమన్‌కు అనుకూలగా మాట్లాడిన వారిని దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఎంతో మంది చావుకు కారణమైన దుర్మార్గుడిని ప్రజల దృష్టిలో హీరోగా చిత్రీకరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
 ప్రధాన నిందితులు, టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహిం‌లను ఎక్కడున్న భారత్ తీసుకొచ్చి ఉరితీస్తేనే ముంబై పేలుళ్ల మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందని శివసేన అభిప్రాయపడింది. 

Share this Story:

Follow Webdunia telugu