'ఖల్నాయక్' జకీర్ నాయక్ తల తెగ నరికితే రూ.15 లక్షలిస్తాం.. హుస్సైని టైగర్స్ రివార్డు
బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్పై మిలిటెంట్లు దాడి చేసి ఊచకోత కోసిన ఘటనతో పాటు.. కాశ్మీర్ అల్లర్లకు ఓ కారణభూతుడిగా భావిస్తున్న వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ తల తెగనరికితే రూ.15 లక్షల
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్పై మిలిటెంట్లు దాడి చేసి ఊచకోత కోసిన ఘటనతో పాటు.. కాశ్మీర్ అల్లర్లకు ఓ కారణభూతుడిగా భావిస్తున్న వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ తల తెగనరికితే రూ.15 లక్షల బహుమానం ఇస్తామని హుస్సైని టైగర్స్ అనే సంస్థ ప్రకటించింది.
'ఆయన ఒక కల్నాయక్ (విలన్). ఇస్లాం ప్రవక్తను ఆయన అవమానించారు. ఆయనను (జకీర్) చంపిన వారికి రివార్డు ఇస్తాం' అని 'హుస్సైని టైగర్స్' నేత సైయద్ కల్బె హుస్సైని నఖ్వి ప్రకటించారు. పైగా, జకీర్ను ఓ 'కాఫిర్'గా ఆయన అభివర్ణించారు.
ఈనెల 1న ఢాకాలోని రెస్టారెంట్పై దాడికి పాల్పడి 22 మందిని ఊచకోతకోసిన కొందరు మిలిటెంట్లు.. జకీర్ ప్రసంగాల ప్రేరణతోనే తాము ఈ దాడులకు పాల్పడినట్టు చెప్పడంతో జకీర్ చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం జకీర్ నాయక్ 'పీస్ టీవీ' ఛానెల్ ప్రసారాలపై బంగ్లాలో నిషేధం విధించింది.