కలలో కాళికాదేవి కనిపించిందనీ నాలుక్కోసి అమ్మోరికి మొక్కు తీర్చిన విద్యార్థిని
కలలో కాళికాదేవి కనిపించిందనీ ఓ కాలేజీ విద్యార్థిని తన నాలుక తెగ్గోసి అమ్మోరికి మొక్కుగా సమర్పించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ కళాశాలలో ఆర్తీ దుబే అనే యువతి డిగ్రీ చ
కలలో కాళికాదేవి కనిపించిందనీ ఓ కాలేజీ విద్యార్థిని తన నాలుక తెగ్గోసి అమ్మోరికి మొక్కుగా సమర్పించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ కళాశాలలో ఆర్తీ దుబే అనే యువతి డిగ్రీ చదువుతోంది. 19 ఏళ్ళ వయసున్న ఆర్తీకి కాళికాదేవి కలలో కనిపించిందని.. తనకు నాలుకను సమర్పించమని కోరిందని చెప్పింది. దీంతో రీవా పట్టణంలోని కాళికాదేవి ఆలయానికి వెళ్ళిన ఆర్తీ... బ్లేడుతో నాలుక కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
అయితే అక్కడి జనం, దేవాలయ సిబ్బంది, కొందరు భక్తులు షాక్ నుంచి తేరుకున్నారో లేదో కానీ.. నాలుక్కోసుకున్న అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించడం మాని.. అమ్మవారు ప్రత్యక్షమైందంటూ సొమ్మసిల్లి పడిపోయిన ఆమె చుట్టూచేరి పూజలు చేయసాగారు.
మరోవైపు ఆర్తీ తన కల గురించి వివరించిందని, అమ్మవారికి నాలుకను కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందని, ఏదో సరదాగా అలా అంటోందే తప్పించి.. నిజంగా ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఆర్తి సోదరుడు సచిన్ ఆందోళన వ్యక్తం చేశాడు.