Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో మహిళా టీచర్‌పై సామూహిక అత్యాచారం!

యూపీలో మహిళా టీచర్‌పై సామూహిక అత్యాచారం!
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (16:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మానభంగాల అడ్డాగా మారిపోతోంది. సోమవారం ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. యూపీలోని భోన్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 
 
బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో కాపుకాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి బంగారు చైన్, ఐదు వేల రూపాయిల నగదు దోచుకున్నారు. అనంతరం పొదలచాటుకు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu