Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీచర్ పైశాచికం : విద్యార్థినులతో అర్థరాత్రి నగ్న స్నానాలు, లైంగిక వేధింపులు

మహారాష్ట్రలో ఓ కీచక టీచర్ పైశాచికత్వం బహిర్గతమైంది. విద్యార్థినులను అర్థరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పతూ వచ్చిన ఓ కీచర్ టీచర్ చీకటి బాగోతం వెలుగ

టీచర్ పైశాచికం : విద్యార్థినులతో అర్థరాత్రి నగ్న స్నానాలు, లైంగిక వేధింపులు
, సోమవారం, 16 జనవరి 2017 (09:33 IST)
మహారాష్ట్రలో ఓ కీచక టీచర్ పైశాచికత్వం బహిర్గతమైంది. విద్యార్థినులను అర్థరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పతూ వచ్చిన ఓ కీచర్ టీచర్ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
చిన్నారుల హక్కుల సంస్థ ఫిర్యాదు మేరకు షిర్పూప్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 36 మంది బాలికలు ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నివాస భవనాలు ఉన్నాయి. 
 
స్కూల్లో మొత్తం 8 మంది పురుష టీచర్లు ఉండగా, వారిలో ప్రతీ వారం ఇద్దరు చొప్పున స్కూల్లోనే బస చేస్తుంటారు. స్కూల్లో వార్డెన్ లేరని, మహిళా టీచర్ ఒక్కరూ లేరని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ అయోధ్యకు రావాలి.. రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇస్తేనే?: సత్రేంద్ర దాస్