టీచర్ పైశాచికం : విద్యార్థినులతో అర్థరాత్రి నగ్న స్నానాలు, లైంగిక వేధింపులు
మహారాష్ట్రలో ఓ కీచక టీచర్ పైశాచికత్వం బహిర్గతమైంది. విద్యార్థినులను అర్థరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పతూ వచ్చిన ఓ కీచర్ టీచర్ చీకటి బాగోతం వెలుగ
మహారాష్ట్రలో ఓ కీచక టీచర్ పైశాచికత్వం బహిర్గతమైంది. విద్యార్థినులను అర్థరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పతూ వచ్చిన ఓ కీచర్ టీచర్ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
చిన్నారుల హక్కుల సంస్థ ఫిర్యాదు మేరకు షిర్పూప్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 36 మంది బాలికలు ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నివాస భవనాలు ఉన్నాయి.
స్కూల్లో మొత్తం 8 మంది పురుష టీచర్లు ఉండగా, వారిలో ప్రతీ వారం ఇద్దరు చొప్పున స్కూల్లోనే బస చేస్తుంటారు. స్కూల్లో వార్డెన్ లేరని, మహిళా టీచర్ ఒక్కరూ లేరని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.