Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండో-పాక్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తతమే : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రహా

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా వ్యాఖ్యానించారు. అందువల్ల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, తాము సర్వదా సిద్ధంగా

ఇండో-పాక్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తతమే : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రహా
, బుధవారం, 5 అక్టోబరు 2016 (08:41 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా వ్యాఖ్యానించారు. అందువల్ల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, తాము సర్వదా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
యురీ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ దాడులకు ప్రతిగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైన్యం సర్జికల్‌ దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రహా అన్నారు. 
 
అయితే, ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సర్జికల్‌ దాడుల తర్వాత వాటిపై మీడియాతో మాట్లాడిన త్రివిధ దళాల చీఫ్‌లలో రహా తొలివ్యక్తి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో) తప్ప త్రివిధ దళాల ప్రధానాధికారుల్లో ఎవరూ సర్జికల్‌ దాడులపై స్పందించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు వచ్చిన గర్భానికి నీవు కారణం కాదన్న ప్రేయసి.. హత్యచేసిన భారతీయ ప్రియుడు