Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిమినల్స్‌కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు

క్రిమినల్స్‌కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు
, బుధవారం, 27 ఆగస్టు 2014 (20:10 IST)
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ప్రకటించాలనంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ముఖ్యంగా.. నేరాభియోగాలు ఉన్న మంత్రులు బాధ్యతలు నిర్వర్తించడం సరికాదన్న సుప్రీంకోర్టు వారిని తొలగించాలంటూ తీర్పునివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. అందువల్ల నేరాభాయోగాలు ఉన్న మంత్రులపై అనర్హత వేటు వేయడం కుదరదని కోర్టు తీర్పునిచ్చింది. ప్రధాని, ముఖ్యమంత్రులపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతలున్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. 2004లో దాఖలైన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎంలోదాతో కూడినటువంటి ధర్మాసనం కీలకమైన తీర్పునిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu