Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునంద హత్య కేసు.. నిజాలన్నీ శశిథరూర్‌కు తెలుసు : అమర్ సింగ్

సునంద హత్య కేసు.. నిజాలన్నీ శశిథరూర్‌కు తెలుసు : అమర్ సింగ్
, గురువారం, 29 జనవరి 2015 (11:37 IST)
సునంద హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద బుధవారం రెండు గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సునంద హత్యకు దారితీసిన పరిస్థితులు, ఐపీఎల్ వివాదంపై అమర్ సింగ్ వద్ద సిట్ బృందం సభ్యులు ప్రశ్నల వర్షం గుప్పించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, సునంద చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఐపీఎల్ వివాదంపై తనతో మాట్లాడారని అమర్‌సింగ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ విషయంలో ఆరోపణలన్నింటినీ తన భర్త కోసం కావాలనే తనపై వేసుకున్నానని, నిజానిజాలన్నీ శశిథరూర్‌కి మాత్రమే తెలుసునని సునంద తనతో అన్నట్లు అమర్ పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని క్షుణ్ణంగా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కుటుంబానికి సన్నిహితుడిగా చెప్పుకొనే అమర్‌సింగ్ నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. థరూర్ దంపతుల మధ్య ఎలాంటి బంధం ఉండేది, ఐపీఎల్ వివాదం, పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు సంబంధాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమర్‌సింగ్‌కు సునంద ఏమైనా చెప్పారా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu