Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజన్‌ దైవదూత.. నేను దెయ్యాన్నా? మీడియా ఆకాశానికెత్తేస్తోంది : స్వామి ఫైర్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు.

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (08:31 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో మీడియాను కూడా దుయ్యబట్టారు. రాజన్‌ను మీడియా ఆకాశానికెత్తేస్తోందంటూ మండిపడ్డారు. 
 
ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాజన్‌ను దైవదూతలా, నన్ను దెయ్యంలా మీడియా చిత్రీకరిస్తోంది. మీడియా ప్రచారం తీరు చూస్తే, మనల్ని రక్షించడం కోసం ఆయన విదేశాల నుంచి దిగివచ్చినట్టుగా ఉంది. ఆయన్ను మీడియా బాగా ఎత్తేస్తోంది. రాజన్‌ వైదొలిగితే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిపోతుందని మీడియానే భయపెట్టింది. కానీ వాస్తవంలో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచి.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులకు అప్పులు పుట్టకుండా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్‌ నష్టం చేస్తున్నారంటూ  సుబ్రమణ్య స్వామి విమర్శలు ఎక్కుపెట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments