Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హత్య చేసినవాడెవడో....? మా బంగారు తల్లి గురించి పిచ్చి రాతలు రాయొద్దు... చెన్నై టెక్కీ స్వాతి అంకుల్...

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయ

హత్య చేసినవాడెవడో....? మా బంగారు తల్లి గురించి పిచ్చి రాతలు రాయొద్దు... చెన్నై టెక్కీ స్వాతి అంకుల్...
, సోమవారం, 27 జూన్ 2016 (13:08 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయి చేశాడంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై స్వాతి అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వాడెవడో... ఎందుకు హత్య చేశాడో మాకు తెలియదు. పోలీసులు తమకు అందించిన ఫుటేజిలో తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తిగా వాడు కనిపించడంలేదు. అలాంటి వాడెవడో తమ బంగారు తల్లి స్వాతికి లింకులు పెట్టి రాయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటి రాతలు రాయవద్దనీ, పోలీసులు దర్యాప్తులో నిజాలు తేలుతాయని ఆయన అన్నారు. నిందితుడిని పట్టుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ్ సడక్ యోజన్ పుణ్యం.. 69 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి బస్సొచ్చింది..!