ప్రపంచ ప్రసిద్ధి చెందిన జర్మనీ దేశ టెన్నిస్ క్రిడాకారిణి స్టెఫీగ్రాఫ్ భారతదేశంలో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ అంశంపై కేరళ రాష్ట్ర కేబినెట్లో సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నిర్ణయం తీసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్ను కేరళ ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు చెప్పారు.
విజిట్ కేరళ పథకంలో భాగంగా స్టెఫీ గ్రాఫ్తో అంబాసిండర్గా నియమించే ఒప్పందం చేసుకునేందుకు కేరళ టూరిజం విభాగం అనుమతించినట్టు చాందీ చెప్పారు. ఇప్పటికే టూరిజం విభాగం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అగ్రిమెంట్ కూడా అందించారని వివరించారు. తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న 46 ఏళ్ల స్టెఫీ, 1999లో టెన్నిస్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.