Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై మెట్రో రైలులో స్టాలిన్, విజయకాంత్ జర్నీ.. అంతా ఓకే, టికెట్ రేట్లు..?

చెన్నై మెట్రో రైలులో స్టాలిన్, విజయకాంత్ జర్నీ.. అంతా ఓకే, టికెట్ రేట్లు..?
, బుధవారం, 1 జులై 2015 (15:43 IST)
చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలులో బుధవారం పలువురు రాజకీయ నేతలు ప్రయాణించారు. తొలి దశలో ఆలందూరు నుంచి కోయంబేడు మధ్య ప్రారంభమైన మెట్రో రైలులో అనుచరులతో కలసి డీఎంకే నేత ఎంకే స్టాలిన్, మాజీ మేయర్ ఎం.సుబ్రమణ్యమ్‌లు మెట్రో రైలులో జర్నీ చేశారు.
 
మరోవైపు డీఎండీకే వ్యవస్థాపకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్‌ కూడా స్టాలిన్‌తో పాటు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణం సమయంలో ఇతర ప్రయాణికులతో మాట్లాడానని, టికెట్ రేట్లు తగ్గించాలని వారు కోరినట్లు చెప్పారు. అందుచేత తమిళనాడు ప్రభుత్వం మెట్రో రైలు ఛార్జీలను తగ్గించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu