Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జార్ఖండ్ అడవుల్లో సైబర్ నేరగాళ్ళు.. రోజుకు 1-2 లక్షలు సంపాదిస్తారట.. నోట్ల రద్దు వరంగా మారింది..

జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల్లో సైబర్ నేరగాళ్లు తిష్ట వేసుకుని కూర్చున్నారట. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో చాలామంది సైబర్ క్రిమినల్స్ జార్ఖండ్ అడవుల నుంచి తమ దందా సాగిస్తున్నారని షాకింగ్ న

జార్ఖండ్ అడవుల్లో సైబర్ నేరగాళ్ళు.. రోజుకు 1-2 లక్షలు సంపాదిస్తారట.. నోట్ల రద్దు వరంగా మారింది..
, బుధవారం, 4 జనవరి 2017 (15:31 IST)
జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల్లో సైబర్ నేరగాళ్లు తిష్ట వేసుకుని కూర్చున్నారట. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో చాలామంది సైబర్ క్రిమినల్స్ జార్ఖండ్ అడవుల నుంచి తమ దందా సాగిస్తున్నారని షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దేశంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో.. ఈ నేరాలన్నీ జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల నుంచేనని జరుగుతున్నాయని తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం జార్ఖండ్ అడవుల నుంచేనని తెలియవచ్చింది. 
 
కాగా, రాంచీకి సుమారు 225 కి.మీ. దూరంలోని ఈ జిల్లాలో గల అడవుల్లో సైబర్ నేరగాళ్ళు తిష్ట వేసుకుని కూచున్నారట. యూజర్ల స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడంలో నేర్పరులైన వీళ్ళు క్షణాల్లో వారి బ్యాంక్ ఖాతాలను వివరాలను తీసుకుని తమ అకౌంట్లకు సొమ్మును మళ్లించుకోగలిగే సామర్థ్యం కలవారని తేలింది.

తాజాగా నోట్ల రద్దు ఈ క్రిమినల్ గ్యాంగ్‌కు వరంగా మారింది. డిమానిటైజేషన్ తరువాత ప్రభుత్వ నిబంధనలను పాటించని, ట్యాక్స్ ఎగవేతదారులే వీరి టార్గెట్. తాము ఫలానా బ్యాంకు ప్రతినిధులమని కాల్ చేసి.. మీ డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పి.. వివరాలను సేకరిస్తారు. డెబిట్ కార్డును యాక్టివేట్ చేయిస్తామని చెప్పి వారి డీటైల్స్ తెలుసుకున్న కొద్ది సేపటికే కార్డుల్లోన్ని నగదును దోచేస్తారు. 
 
ఇలా జంతారా అడవుల్లోని ఈ ముఠాలు కేవలం ఓ రెండు మూడు డెబిట్ కార్డుల ద్వారా రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు దోచుకుంటున్నారని తెలిసింది. ఈ దోచుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదిమందిని పొట్టనబెట్టుకున్న నరరూపరాక్షసుడు.. శబ్ధం లేకుండా ఒక్కొక్కరిగా చంపేశాడు..