రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో బాలికలు, మహిళలు సోషల్ మీడియాను వాడకూడదంటూ పెద్దలు ఫర్మానా జారీ చేశారు. అంతేగాకుండా జీన్స్ కూడా ధరించకూడదని ఆదేశించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో అనుసంధానం అయ్యే ఉంటారు.
దేశాధినేతలు కూడా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియానే ఉపయోగించుకుంటున్నారంటే... వాటి ప్రాధాన్యత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, అదే సోషల్ మీడియాను 'ఖాప్' పెద్దలు బహిష్కరించారు. సోషల్ మీడియా, జీన్స్పై నిషేధం విధించిన ఖాప్ పెద్దలు.. పెళ్లి సమయంలో వరుడు కచ్చితంగా పంచె కట్టుకోవాలని, పెళ్లికూతురు గాగ్రా ధరించాలని సూచించారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, ఖాప్ పెద్దల ఫర్మానా పట్ల ఆధునికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.