Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాను.. ముగ్గురు మహిళలు..?: దీప్తీ సర్నా

నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాను.. ముగ్గురు మహిళలు..?: దీప్తీ సర్నా
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:45 IST)
స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తీ సర్నా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని నాశనం చేసే పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నానని చెప్పింది. అంతకన్నా ముందు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించిందని తెలిపింది. బుధవారం రాత్రి నుంచి అదృశ్యమైన దీప్తి సర్నా ఉదంతం సుఖాంతం కాగా, ఆమె తన తల్లిదండ్రులను కలుసుకుంది. తనకు ఏమైందోననే విషయాన్ని స్వయంగా పోలీసులకు వెల్లడించింది.
 
ఇంటికి వెళ్లేందుకు షేర్ ఆటోను తాను ఎక్కానని అందులో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నారని చెప్పింది. తాను చెల్లెలితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆటో దారి మళ్లడాన్ని గమనించి కేకలు పెట్టానని, ఆ వెంటనే ఆటోలో ఉన్న మిగతావారు తనను అరవకుండా బంధించి, కిడ్నాప్ చేశారని తెలిపింది.
 
దీప్తి అదృశ్యమైన తరువాత, కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 200 మందిని రంగంలోకి దింపి విస్తృతంగా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏ హానీ జరగలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. ఆమె పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నదని, కోలుకున్నాక మరోసారి విచారిస్తామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu