Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడవ బోల్తా.. ముగ్గరు చిన్నారులతో సహా ఆరుగురి దుర్మరణం

పడవ బోల్తా.. ముగ్గరు చిన్నారులతో సహా ఆరుగురి దుర్మరణం
, శనివారం, 1 నవంబరు 2014 (16:50 IST)
బీహార్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బీహార్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్లో ఈ ప్రమాదం జరిగింది.
 
శనివారం 16 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవ అకస్మాత్తుగా డ్యామ్లో బోల్తాపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను గ్రామస్తుల సాయంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. గల్లంతయిన ఐదుగురిని కాపాడేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu