Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వావివరుసలు మరచి... అన్నను పెళ్లి చేసుకున్న చెల్లెలు...!

వావివరుసలు మరచి... అన్నను పెళ్లి చేసుకున్న చెల్లెలు...!
, సోమవారం, 6 జులై 2015 (11:11 IST)
''వావివరుసలు లెక్కచేయక మూర్ఖత్వంలో మునిగితేలిన'' అన్న బ్రహ్మంగారి మాటలు ఫలిస్తున్నాయి. వరుసకు అన్నాచెల్లెళ్ళు అయ్యే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం సామ్రాజ్ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కడ జాగేరి బాస్కల్ గ్రామానికి చెందిన యువతి జబమాలై మేరి. ఆమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన అన్న వరుస అయ్యే జేసుదాస్‍‌ను ప్రేమించింది.
 
వారి ప్రేమకు ఇరు తరపు కుటుంబీకులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ స్థితిలో జూన్ నెల 13వ తేది ఉదయం ఆస్పత్రికి వెళ్లిన మేరీ సాయంత్రం ఎంత సేపటికీ ఇంటికి రాలేదు. అదే సమయంలో జేసుదాస్ కూడా కనిపించలేదు. దీంతో సందేహించిన మేరీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి వారి కోసం తీవ్రంగా గాలించారు. 
 
పోలీసుల విచారణలో వారిద్దరూ బెంగుళూరులోని అత్తిపోలో ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఒక ఇంటిలో ఉన్న జబమాలై మేరీ, జేసుదాస్‌లను పట్టుకున్నారు. అనంతరం ఇరు కుటుంబీకులను పిలిపించి పోలీసు స్టేషన్‌లో చర్చించారు. ఆ సమయంలో మేరీ కుటుంబీకులు ఆమెను తిరిగి తమతో పాటు వచ్చేయాలని ప్రాదేయపడ్డారు. అయితే ఆమె నిరాకరించింది. దీంతో మేరీ, జేసుదాస్‌లు మేజర్‌లు కావడంతో పోలీసు కూడా చేసేది లేక వారిని పంపించివేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu