Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రైవర్ లేకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగో పరుగు... సొరంగంలో ప్రయాణికులతో....

పైలెట్ లేకుండా విమానం నడిస్తుంది అంటే నమ్ముతాం. రోబొటిక్ టెక్నాలజీతో నడిచే వాహనం గురించి తెలుసు. కానీ డ్రైవర్ లేకుండా ఓ రైలు పరుగులు తీస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేముంది పైప్రాణాలు పైనే పోవు. కా

డ్రైవర్ లేకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగో పరుగు... సొరంగంలో ప్రయాణికులతో....
, మంగళవారం, 28 జూన్ 2016 (16:41 IST)
పైలెట్ లేకుండా విమానం నడుస్తుంది అంటే నమ్ముతాం. రోబొటిక్ టెక్నాలజీతో నడిచే వాహనం గురించి తెలుసు. కానీ డ్రైవర్ లేకుండా ఓ రైలు పరుగులు తీస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేముంది పైప్రాణాలు పైనే పోవు. కానీ ఇది జరిగింది. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవరు లేకుండా 15 కిలోమీటర్ల మేర పరుగులు తీసింది. 
 
ఈ ఘటన సోమవారంనాడు మజ్‌గావ్-నిజామూద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు జరిగింది. రత్నగిరి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్నప్పుడు రైలు ఇంజినులో లోపం ఏర్పడింది. దీనితో సాయంత్రం 5.50 నిమిషాలకు బండిని ఆపేసి టెక్నికల్ సమస్య గురించి చెక్ చేస్తున్నారు. టెక్నీషియన్లు లోపాన్ని సరిదిద్దే క్రమంలో లోకో పైలట్ గార్డు క్యాబిన్లోకి వెళ్లాడు. ఐతే లోపం సరిచేయకమునుపే రైలు కదలడం ప్రారంభించింది. 
 
సొరంగం అంతా పల్లంగా ఉండటంతో వేగంగా అలా 15 కిలోమీటర్ల మేరు దూసుకువెళ్లింది. దీంతో లోకో పైలెట్ విషయాన్ని గమనించి గార్డు క్యాబిన్ నుంచి ఇంజిన్లోకి దూరి రైలును తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఐతే ఈ వార్తలను కొంకణ్ రైల్వే చైర్మన్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ జరగలేదని బుకాయించారు. మరి ఈ విషయం ఎలా బయటకు వచ్చిందోమరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాన్సింగ్ పీకాక్ స్పైడర్ గురించి మీకు తెలుసా? ఆ స్పైడర్‌‌కు ఎన్ని రంగులో?!