పోలీసులపై చెంపదెబ్బలు.. దాడి చేసిన శివసేన ఎమ్మెల్యే అల్లుడికి ఏడాది కారాగార శిక్ష
పోలీసులపై చేజేసుకున్న శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ రావు సాహెబ్ దన్వే అల్లుడు హర్షవర్ధన్కు కోర్టు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే పోలీసుల రెండు చెంప దెబ్బలకు కొట్టినందుకు గ
పోలీసులపై చేజేసుకున్న శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ రావు సాహెబ్ దన్వే అల్లుడు హర్షవర్ధన్కు కోర్టు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే పోలీసుల రెండు చెంప దెబ్బలకు కొట్టినందుకు గానూ రూ.10వేల చొప్పున జరిమానా చెల్లించాలని హర్షవర్ధన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2011లో ఎల్లోరాలో హర్షవర్ధన్ పోలీసులపై దాడి చేసి చెంపదెబ్బలు కొట్టినట్లు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ కేసును విచారించి ఔరంగాబాద్ జిల్లా కోర్టు ఎమ్మెల్యేకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కాగా 2011లో ఎల్లోరాలో భద్రతా కారణాల రీత్యా మంత్రి వెంటే వెళ్తున్న హర్షవర్ధన్ను ఆపాడని.. ఆ సమయంలో ఏర్పడిన గొడవలో పోలీసులపై హర్షవర్ధన్ చేజేసుకున్నాడని సాక్ష్యాలను బట్టి కోర్టులో తేలడంతో ఆతనికి కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇకపోతే.. భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమైన మిత్రపక్షాల్లో శివసేన ఒకటి. అలాంటి శివసేన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించింది.
పిచ్చివాళ్ళ స్వర్గంలో బీజేపీ నేతలు విహరిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గత పది వేల సంవత్సరాల్లో ఎన్నడూ ఇంత ఘోరమైన పాలన చూడలేదని ఘాటైన విమర్శలు చేసింది.