Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజమే.. షీనా బోరాను నేనే చంపాను : విచారణలో ఇంద్రాణి

నిజమే.. షీనా బోరాను నేనే చంపాను : విచారణలో ఇంద్రాణి
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:05 IST)
మీరకున్నట్టుగా షీనా బోరాను నేనే చంపాను అని స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జియా చెప్పారు. ఈ మేరకు ముంబై పోలీసుల విచారణలో ఆమె అంగీకరించినట్టు సమాచారం. అయితే, ఎందుకు చంపారన్న అంశంపై పోలీసులు ఆమె వద్ద మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 
 
తన కడుపున పుట్టిన బిడ్డ షీనా బోరాను హత్యచేసింది తానేనని ఇంద్రాణి అంగీకరించింది. పోలీసుల విచారణలో దాదాపు వారం రోజుల పాటు మౌనం పాటించిన ఆమె, ఎట్టకేలకు నోరు విప్పి తప్పు ఒప్పుకుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఆమెకు తొలుత విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను ముంబై బాంద్రా కోర్టులో హాజరుపరిచిన విషయంతెల్సిందే. ఆ సమయంలో తన రెండో కుమార్తె విధితో కొద్దిసేపు మాట్లాడింది. ఆ తర్వాత కోర్టు ఆదేశం మేరకు ఆమె పోలీసు కస్టడీలోకి వెళ్లింది. ఈనెల 5వ తేదీ వరకు ఆమె పోలీసుల కస్టడీలోనే ఉండనుంది. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం నాటి విచారణలో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతకుముందంతా షీనా బతికేవుందని, అమెరికాలో చదువుతోందని, తానంటే కోపంతోనే బయటకు రావడం లేదని ఇలా అనేక కథలు చెబుతూ వచ్చిన ఇంద్రాణి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. అంతేకాకుండా, హత్య వెనుక ఏ ఆర్థిక కారణాలు లేవని, ఎవరూ ప్రేరేపించలేదని చెప్పిన ఆమె, మైఖేల్‌ బోరాను హత్య చేయాలన్న ఉద్దేశం తనకేనాడూ లేదని స్పష్టం చేసినట్టు వినికిడి. 
 
అయితే, దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ 'మొత్తం నేరంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. మాకు కొన్ని అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తాం' అని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇదిలావుండగా, రాయగఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలు షీనావేనని గుర్తించేందుకు, ఆమె తండ్రిగా ప్రపంచానికి పరిచయమైన సిద్ధార్థ దాస్ను ముంబై రప్పించి డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu