Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్.. నేనే హత్య చేశా.. : షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి

ఎస్.. నేనే హత్య చేశా.. : షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి
, గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:42 IST)
తన కుమార్తె షీనా బోరాను తానే హత్య చేసినట్టు తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబై పోలీసుల విచారణలో వెల్లడించారు. తన కుమార్తె షీనా బోరాను తాను హత్య చేయలేదంటూ చెప్పుకొచ్చిన ఇంద్రాణి దాదాపు పది రోజుల తర్వాత నేరాన్ని అంగీకరించింది. హత్యకు దారితీసిన పరిస్థితులను ఇంద్రాణి పోలీసులకు వివరించారు. ఆ సమయంలో ఆమె కుప్పకూలి పడిపోయినట్లు సమాచారం. 
 
మరోవైపు... ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియాను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా నాలుగు గంటల పాటు ఇంద్రాణిని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడిగారు. తొలుత ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టిన పోలీసులు, తమకున్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. పీటర్ చెప్పిన సమాధానాలు, ఇంద్రాణి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu