అత్యాచారం చేశారు.. ఆపై బ్లేడుతో చర్మాన్ని చెక్కేశారు... యువతి ఆత్మహత్యాయత్నం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీలో దారుణం జరిగింది. ఇద్దరు కామాంధులు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చర్మాన్ని బ్లేడుతో చెక్కేశాడు. ఈ విషయం బయటకు చెపితే జైలుకెళ్లి వచ్చాక హత్య చేస్త
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీలో దారుణం జరిగింది. ఇద్దరు కామాంధులు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చర్మాన్ని బ్లేడుతో చెక్కేశాడు. ఈ విషయం బయటకు చెపితే జైలుకెళ్లి వచ్చాక హత్య చేస్తానంటూ బెదిరించాడు. దీంతో హడలిపోయిన ఆ బాధితురాలు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
గత ఫిబ్రవరిలో బాధితురాలిని ఇటార్సీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అటకాయించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బ్లేడుతో శరీరంలోని పలు ప్రాంతాల్లో చెక్కేసి, కొన ప్రాణంతో ఉండగా వదిలేసి పారిపోయారు. ఆపై బాలిక ప్రాణాలతో బయటపడి కేసు పెట్టగా, నిందితులను జైలుకు పంపారు. ఇద్దరు నిందితుల్లో ఒకడికి బెయిల్ మంజూరైంది.
బయటకు వచ్చిన ఆ వ్యక్తి, బాధితురాలిని బెదిరించడంతో హడలిపోయిన ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. శరీరంలో 40 శాతం కాలిపోయిన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని వైద్యులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.