Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయహో నరేంద్ర మోడీ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కితాబు!

జయహో నరేంద్ర మోడీ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కితాబు!
, గురువారం, 2 అక్టోబరు 2014 (10:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా పర్యటనలో అపార పరిణితిని చూపిన నరేంద్ర మోడీ.. గతంలో అమెరికాలో పర్యటించిన భారత ప్రధానమంత్రుల కంటే.. మోడీ ఎంతగానో ఆకట్టుకున్నారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ‘మోడీ వ్యాపార, నిర్వహణ నైపుణ్యాలు మిగిలిన ప్రధానుల కంటే మెరుగైనవి. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించడంతో పాటు పలు కొత్త ఒప్పందాలకు తెరతీసిన మోడీ, మిగిలిన ప్రధానుల కంటే ముమ్మాటికీ మెరుగైనవారే’ నంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్ పార్టీతో ఉన్న 15 ఏళ్ల నాటి బంధాన్ని తెంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించనున్నశరద్ పవార్ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకునే దిశగా పయనిస్తోందన్న వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu