Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కూల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం... ఆపై హత్య

స్కూల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం... ఆపై హత్య
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:06 IST)
స్కూలు బాలిక ఆమెను ఓ గ్యాంగు కిడ్నాప్ చేసింది. అత్యాచారం చేసింది. ఆ శరీరంతో ఆడుకున్నారు. వళ్ళంతా గాట్లే, గాయలే. చివరకు ఆ విద్యార్థిని గురువారం సాయంత్రానికి శవమై తేలింది. వివరాలిలా ఉన్నాయి. 
 
పంజాబ్ లోని లూధియానాకు చెందిన విద్యార్థిని స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా బుధవారం సాయంత్రం కిడ్నాప్నకు గురైంది. విద్యార్థినిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లిన దుండగులు గ్యాంగ్ సభ్యులు రేప్ చేశారు. గురువారం సాయంత్రం బాలిక శవమై ఓ కాలువలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
 
బాధిత బాలిక శరీరంపై సుమారు 17 గాయాలున్నట్లు వారు తెలిపారు. తలపై పెద్దగా గాట్లు కూడా ఉన్నాయని, బలమైన ఆయుధంతో నిందితులు ఆమెపై దాడి చేసి ఉండవచ్చని తెలుస్తోంది. బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో వారు ఆందోళన చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu