Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలిపించిన ఓటర్లకు జయలలిత ధన్యవాదాలు: జయకు గవర్నర్ రోశయ్య శుభాకాంక్షలు

గెలిపించిన ఓటర్లకు జయలలిత ధన్యవాదాలు: జయకు గవర్నర్ రోశయ్య శుభాకాంక్షలు
, మంగళవారం, 30 జూన్ 2015 (14:47 IST)
తనను భారీ మెజారిటీతో గెలిపించిన రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ధన్యవాదాలు తెలియజేశారు. సమీప ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి సుమారు లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో తనను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 
 
కాగా జయ విజయం వచ్చే ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకె విజయానికి సూచిక అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాగా జయలలిత విజయం సాధించిన నేపధ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu