Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ఎయిమ్స్‌ షాక్... బ్రెడ్ ప్యాకెట్ నుంచి బతికి ఉన్న ఎలుక జంప్

ఢిల్లీ ఎయిమ్స్‌ షాక్... బ్రెడ్ ప్యాకెట్ నుంచి బతికి ఉన్న ఎలుక జంప్
, మంగళవారం, 13 అక్టోబరు 2015 (20:49 IST)
దేశ ఆరోగ్య శాఖలకు మార్గనిర్దేశం చేసే వైద్యాలయం అది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS). ఇక్కడ చికిత్స కోసం వచ్చే రోగులకు బ్రెడ్ ఇస్తుంటారు. ఈ బ్రెడ్ ను ఓ కంపెనీ సరఫరా చేస్తూ ఉంది. ఐతే జూలై 29 నాడు గ్యాస్ట్రోఎంటాలజీలో ఓ రోగికి బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వగా అందులో నుంచి బతికి ఉన్న ఎలుక గబుక్కున జంప్ చేస్తూ వెళ్లిపోయింది. 
 
దీంతో షాక్ తిన్న సదరు వ్యక్తి విషయాన్ని వెంటనే డిపార్టుమెంటుకు చేరవేశాడు. ఆయన ఈ విషయాన్ని ఎయిమ్స్ సూపరిండెంటుకు తెలుపగా, బ్రెడ్ సరఫరా చేస్తున్న కంపెనీ వివరణ కోరారు. ఐతే వారు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎయిమ్స్ అధికారులు సదరు కంపెనీ ఉత్పత్తులపై 3 ఏళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu