Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య శరీరంపై బూతు టాటూలు... రాజస్థాన్ మహిళపై సోదరులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్...

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలొచ్చినా వారిపై అకృత్యాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను

భార్య శరీరంపై బూతు టాటూలు... రాజస్థాన్ మహిళపై సోదరులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్...
, సోమవారం, 27 జూన్ 2016 (16:09 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలొచ్చినా వారిపై అకృత్యాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హింసించిన అత్తింటివారు ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయాక శరీరంపై ఏడు పచ్చబొట్లు పొడిచారు. అంతటితో వదలకుండా మా నాన్న దొంగ అంటూ పచ్చబొట్టు పొడవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కట్నం కోసం అత్తింటి వారే ఇలా తనను వేధించినట్లు చెప్పారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ అల్వార్‌కు సమీపంలోని ఓ వ్యక్తితో బాధిత మహిళకు 2015లో పెళ్లైంది. అయితే కట్నంగా ఇవ్వాల్సిన రూ.51వేలు పెళ్లి సందర్భంగా వధువు తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. ఈ విషయమై తరచూ అత్తింటివారి నుంచి బాధిత మహిళ వేధింపులకు గురిచేసేవారు. డబ్బు కోసం నానా హింసలు పెట్టేవారు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ దాడి చేసేవారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెతో మత్తుమందు కలిపిన పానీయం ఆమెకు తాగించి దారుణంగా కొట్టారు. ఆపై ఆమె శరీరంపై కనికరం లేకుండా ఏడు పచ్చబొట్లు పొడిచారు. అంతేగాకుండా బాధితురాలు నుదుటిపై మా నాన్న దొంగ అంటూ రాశారు. ఈ ఘటనపై బాధితురాలితో పాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను సామూహిక అత్యాచారానికి గురైయ్యానని... తనకు వైద్యపరీక్ష నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే ఇల్లూగిల్లూ జాన్తానే.. కూల్చివేయాల్సిందే : హైకోర్టు ధర్మాసనం