Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల పాపను ఎత్తుకెళ్లి రేప్ చేసిన డ్రగ్ ఎడిక్ట్స్...

మాదక ద్రవ్యాలకు బానిసలైన కామాంధులు ఇద్దరు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 29న రాజస్థాన్ లోని పాల్ఘర్ జిల్లా బోయ్సార్ ప్రాంతంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికతోపాటు ఆమె తమ్ముడు(ఏడాది)ని ఇద్దరినీ ఎత్తుకెళ

ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల పాపను ఎత్తుకెళ్లి రేప్ చేసిన డ్రగ్ ఎడిక్ట్స్...
, శుక్రవారం, 22 జులై 2016 (16:44 IST)
మాదక ద్రవ్యాలకు బానిసలైన కామాంధులు ఇద్దరు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 29న రాజస్థాన్ లోని పాల్ఘర్ జిల్లా బోయ్సార్ ప్రాంతంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికతోపాటు ఆమె తమ్ముడు(ఏడాది)ని ఇద్దరినీ ఎత్తుకెళ్లిపోయారు. వారు నిద్రలో ఉండగానే వారిద్దరినీ ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి అక్కడ పాపపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఏడాది పిల్లవాడిని హింసించారు. 
 
అతడి చెవిపైన వ్యక్తిగత భాగలపైన తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఐతే ఈ దారుణానికి పాల్పడింది ఎవరన్నది పోలీసులకు అంతుపట్టలేదు. చివరికి అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు అత్యాచారానికి పాల్పడ్డవారు సమీపంలో ఫుట్ పాత్ పైన బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు యువకులని తేలింది. ఐతే అప్పటికే ఒకడు పలాయనం చిత్తగించాడు. ఒక యువకుడిని మాత్రం అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరు మత్తు పదార్థాలకు బానిసలైనట్లు విచారణలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. కాల్ డేటాతో పట్టేశారు..!