Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్‌గా బాధ్యతలు చేపట్టాలి: సచిన్ పైలట్

కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్‌గా బాధ్యతలు చేపట్టాలి: సచిన్ పైలట్
, బుధవారం, 26 ఆగస్టు 2015 (16:12 IST)
వచ్చే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలు భుజాలపై వేసుకోవాల్సిన సమయం వచ్చిందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సచిన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇక పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉంటూ పార్టీకి దిశానిర్దేశం చేయాలని కోరారు.
 
"పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన చేతుల్లో బ్లాంక్ చెక్ ఉన్నట్టు కాదు. తమకు తోచినట్టుగా ప్రభుత్వం నడుపుతామంటే చూస్తూ ఎలా కూర్చుంటాం?" అని మోదీ సర్కారును ఉద్దేశించి సచిన్ విమర్శలు గుప్పించారు.
 
పార్లమెంట్ లోపల, బయట అధికార బీజేపీ విధానాలను రాహుల్ ఎండగడుతున్న తీరు ఆయనపై నమ్మకాన్ని పెంచిందని సచిన్ పైలట్ తీసుకోవాలన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని సచిన్ తెలియజేశారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ వ్యూహాలు ఎంతో తోడ్పడతాయని సచిన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu