Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులను పట్టించుకోని నరేంద్ర మోడీ.. '0 out of 10: రాహుల్ గాంధీ

రైతులను పట్టించుకోని నరేంద్ర మోడీ.. '0 out of 10: రాహుల్ గాంధీ
, సోమవారం, 18 మే 2015 (16:48 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ప్రధానిగా మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప... రైతులను కలసి, వారి కష్టాలను తెలుసుకోవడం లేదని రాహుల్ విమర్శలు కురిపించారు. మోడీకి రైతులను పట్టించుకునే సమయం కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి 10 మార్కులకుగాను సున్నా మార్కులు వచ్చాయని ఎద్దేవా చేశారు. 
 
తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ... అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అమేథీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నుంచి నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టులకు రాహుల్ శంకుస్థాపన చేస్తారని యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు. మరోవైపు చైనా పర్యటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం దక్షిణ కొరియాకు ప్రయాణమైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu