Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనియాపై తెల్ల తోలు వ్యాఖ్యలు : క్లాస్ పీకిన మోడీ.. ఏడ్చేసిన గిరిరాజ్!

సోనియాపై తెల్ల తోలు వ్యాఖ్యలు : క్లాస్ పీకిన మోడీ.. ఏడ్చేసిన గిరిరాజ్!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:30 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై చేసిన తెల్ల తోలు (జాతి వివక్ష) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ చీవాట్లు పెట్టినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సమయంలో గిరిరాజ్ సింగ్ మోడీ వద్ద ఏడ్చేసినట్లు సమాచారం. ఇందులో నిజమేమిటో తెలియదు గానీ ఆ వార్తలను గిరిరాజ్ సింగ్ కొట్టిపారేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం స్పందిస్తూ.. తాను మోడీని కలవనే లేదని, తాను ఏడ్చినట్లు ఎవరు చెప్పారు, ఎవరు చూశారని ఈ మంత్రివర్యులు ప్రశ్నించారు. తెల్ల తోలు మహిళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కాంగ్రెసు నాయకులు అధ్యక్షురాలిగా అంగీకరించేవారా అని గిరిరాజ్ సింగ్ అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెసు సభ్యులు గిరిరాజ్ సింగ్‌పై మండిపడ్డారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు. 

Share this Story:

Follow Webdunia telugu