Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గణేశ్ చందా ఇవ్వలేదని.. బేకరీ కార్మికులతో గుంజీలు తీయించారు...

సాధారణంగా పండగలు, పబ్బాలు, ఉత్సవాలకు చందాలు వసూలు చేయడం ఆనవాయితీ. వచ్చే నెలలో వినాయక చవితి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం చందాలు వసూలు చేపట్టారు.

గణేశ్ చందా ఇవ్వలేదని.. బేకరీ కార్మికులతో గుంజీలు తీయించారు...
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (14:56 IST)
సాధారణంగా పండగలు, పబ్బాలు, ఉత్సవాలకు చందాలు వసూలు చేయడం ఆనవాయితీ. వచ్చే నెలలో వినాయక చవితి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం చందాలు వసూలు చేపట్టారు.
 
మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ప్రకాశ్ లాండేజ్(30), గణేశ్ లాండేజ్(30), మహేశ్ మారే(31) అనే ముగ్గురు కలిసి భోసరి ప్రాంతంలోని ఓ బేకరీ దుకాణానికి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను రూ.151 చొప్పున చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
తమ యాజమాని లేడని, తాము చందా ఇవ్వలేమని మహారాష్ట్రేతరులైన కార్మికులు చెప్పారు. దీంతో కార్మికులను ముగ్గురు నిందితులు నోటికొచ్చినట్టు తిట్టారు. అక్కడితే ఆగకుండా వారితో గుంజీలు తీయించారు. బాధితుడు ఇర్షాద్ మహ్మద్ ఆయుబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచ్చెన్నాయుడుగారూ... నేను టీవీ9 లైవ్ లో ఉన్నా... నయీం లింకుపై చర్చకు సిద్ధమా... నట్టి సవాల్