Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూణెలో దారుణం.. దారి చూపిస్తానని నమ్మించి విద్యార్థినిపై అత్యాచారం!

పూణెలో దారుణం.. దారి చూపిస్తానని నమ్మించి విద్యార్థినిపై అత్యాచారం!
, గురువారం, 2 అక్టోబరు 2014 (17:12 IST)
మహారాష్ట్రలోని పూణెలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. దారి తెలియని ఓ విద్యార్థిని నమ్మించి.. దారి చూపిస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో 32 యేళ్ల కామాంధుడు. పూణెలోని బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ వద్ద నివసిస్తున్న తన స్నేహితురాలిని కలుసుకునేందుకు 18 యేళ్ల విద్యార్థిని వచ్చింది. స్నేహితురాలు చెప్పిన అడ్రస్ ప్రకారం మాల్దాక్కా చౌక్ ప్రాంతానికి చేరుకున్నాక దారి మర్చిపోయింది. దీంతో అక్కడే ఉన్న నావల్ జోసఫ్ (32) అనే వ్యక్తిని సాయం కోరింది. 
 
అడ్రస్ తనకు తెలుసని, స్నేహితురాలిని చేరేందుకు దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెను ఖడ్కీ ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఎవరికైనా చెబితే పరువు తీస్తానంటూ సెల్ ఫోన్‌లో అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు తీశాడు. ఆ కామాంధుడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కామాంధుడుని అరెస్టు చేశారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మాజీ బౌన్సర్‌ అని పోలీసులు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu