Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాహోర్ వెళ్లినపుడే ప్రధాని మోదీని చంపేసి ఉండేవారట... రేగిన దుమారం...

లాహోర్ వెళ్లినపుడే ప్రధాని మోదీని చంపేసి ఉండేవారట... రేగిన దుమారం...
, మంగళవారం, 5 జనవరి 2016 (17:09 IST)
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త శ్రీపాల్ సబ్నిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లినప్పుడు అక్కడే ఆయనను చంపేసి ఉండేవారంటూ శ్రీపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐతే ఈ వ్యాఖ్యలు తను నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమతో చేసిన వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదని ఆయన వాదిస్తున్నారు. గతవారం పింప్రి-చించ్‌వాడ్‌లో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేటపుడు ఆయన పైవిధంగా మాట్లాడారు. దీనితో ఆయనపై భాజపా శ్రేణులు మండిపడుతున్నాయి. 
 
ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పోలీసు భద్రతను కోరారాయన. విశేషమేమిటంటే... శ్రీపాల్ ను మరాఠీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఏదో భాజపాకు అనుకూలంగా ఉంటారనుకుంటే ఆయన మాత్రం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీపాల్ కేవలం సాహిత్యానికి సంబంధించినవే మాట్లాడితే బావుంటుందనీ, మిగిలినవాటి జోలికి వెళ్లకపోవడం మంచిదని భాజపా హితవు పలికింది. 
 
ఐతే శ్రీపాల్ మాత్రం నరేంద్ర మోదీ పాకిస్తాన్ దేశంలోని లాహోర్ వెళ్లినప్పుడు చాలా భయపడ్డానని అంటున్నారు. శ్రీపాల్ మాట తీరు అలాగే ఉంటుందని మరికొందరు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu