Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లధనం వేరు... నల్ల ధనఖాతా వేరు : వైకాపా ఎంపీ పొంగులేటి!

నల్లధనం వేరు... నల్ల ధనఖాతా వేరు : వైకాపా ఎంపీ పొంగులేటి!
, శుక్రవారం, 28 నవంబరు 2014 (09:44 IST)
నల్లధనం వేరు.. నల్లధన ఖాతాలు వేరని తెలంగాణ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లధనంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లధనం, విదేశీ ఖాతాలు వేరన్న విషయం గుర్తించాలని సూచించారు. 1998-2008 మధ్య పదేళ్ల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయల ధనం దేశం దాటిపోయిందన్నారు. 
 
ఈ ధనం మొత్తం పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లాండ్ దేశాలకు తరలిపోయిందని ఆయన వివరించారు. మన ఆర్థిక విధానాలను సరళీకృతం చేసుకుంటే నల్లధనం దేశాలు దాటకుండా చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు విదేశాలతో చర్చలు, సంప్రదింపులు జరపాలని, ఇందుకోసం అవసరమైతే సరికొత్త ఒప్పందాలు, చట్టాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu