Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల స్వాతంత్ర్యం రాలేదు.. కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది : కన్నడ నటి రమ్య

కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ ఎంపీ రమ్య మరోమారు మాటల తూటాలు పేల్చింది. ఇటీవల పాకిస్థాన్ నరకం కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల దే

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల స్వాతంత్ర్యం రాలేదు.. కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది : కన్నడ నటి రమ్య
, బుధవారం, 31 ఆగస్టు 2016 (08:49 IST)
కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ ఎంపీ రమ్య మరోమారు మాటల తూటాలు పేల్చింది. ఇటీవల పాకిస్థాన్ నరకం కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల దేశానికి స్వాతంత్ర్యం లభించలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పుకొచ్చారు. 
 
మంగళవారం మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 'విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె' ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతుండగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ఆంగ్లేయులతో కలసిపోయారని ఆమె ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవాలి... ఉగ్రవాదులు ప్రార్థనలు... ఎందుకంటే...?