Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకు చేతిలోనే ఐదేళ్లూ అనేక అవమానాలు పడ్డా.. మోడీ అన్న మాటలు నిజమే : ములాయం సింగ్‌

ఐదేళ్ళ పాటు తన తనయుడు చేతిలో అనేక అవమానాలు పడినట్టు, ఈ విషయంలో గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలన్నీ నిజమని ఎస్పీ అధినేత ములాయం సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ‘తండ్రికి ద్రోహం చేసేవాడు ప్

కొడుకు చేతిలోనే ఐదేళ్లూ అనేక అవమానాలు పడ్డా.. మోడీ అన్న మాటలు నిజమే : ములాయం సింగ్‌
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (16:17 IST)
ఐదేళ్ళ పాటు తన తనయుడు చేతిలో అనేక అవమానాలు పడినట్టు, ఈ విషయంలో గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలన్నీ నిజమని ఎస్పీ అధినేత ములాయం సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ‘తండ్రికి ద్రోహం చేసేవాడు ప్రజలకు న్యాయం చేయలేడు అన్న మాట నిజమే’ అని ములాయం మీడియాతో అన్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నౌజ్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నప్పుడు అఖిలేశ్‌ గురించి ఇదేవిధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సొంత ప్రాంతంలోనే శాసనసభ్యులతో ప్రత్యేక విందు కార్యక్రమం రద్దు చేయడం తనకు అవమానకరంగా ఉందని.. గత ఐదేళ్లలో ఇంత అవమానం పడింది లేదన్నారు. ములాయం అఖిలేశ్‌ను ఎద్దేవాచేస్తూ మోడీ మాటలు నిజమేనంటూ సమర్ధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసీదుకు వచ్చిన 20 మందిని దుస్తులు విప్పేసి కత్తితో పొడిచి చంపారు...