Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ మెట్రో రైల్‌లో నరేంద్ర మోడీ.. ఎంతో ఎంజాయ్ చేశా!

ఢిల్లీ మెట్రో రైల్‌లో నరేంద్ర మోడీ.. ఎంతో ఎంజాయ్ చేశా!
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:32 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఆయన తన కార్లు, కాన్వాయ్, భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి ఢిల్లీ మెట్రో రైలులో ధౌలా కువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు. 
 
దానిపై ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ, "మెట్రో రైలులో ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఢిల్లీ మెట్రోకు కృతజ్ఞతలు. శ్రీధరన్ జీకు (మెట్రో రూపకర్త) కూడా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. 
 
దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పని చేసిన ప్రధానమంత్రులంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు.  ప్రతి విషయంలోనూ స్వేచ్ఛగా, బహిరంగంగా స్పందిస్తారు. అంతేకాదు ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu