Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్

మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్
, శనివారం, 25 అక్టోబరు 2014 (16:38 IST)
ప్రధాని నరేంద్రమోడీ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యాలయంలో నరేంద్రమోడీ సంపాదకులు, విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
తమ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించామని మోడీ వ్యాఖ్యానించారు. మీడియాతో తాము సత్సంబంధాలను నెరపుతామని ప్రకటించారు. 
 
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దివాలీ మిలాన్‌ను పురస్కరించుకుని తొలిసారి మీడియాతో భేటీ అయిన మోడీ పలు అంశాలను ప్రస్తావించారు. 
 
దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. అలాగే క్లీన్ ఇండియాలో మీడియా కూడా పాలుపంచుకోవాలని, తద్వారా దేశానికి మీడియా సేవ చేసినట్లు అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu