Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న నరేంద్ర మోడీ - చంద్రబాబు!

విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న నరేంద్ర మోడీ - చంద్రబాబు!
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (09:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమతమ విదేశీ పర్యటనలను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనలకు గత వారం బయలుదేరిన విషయం తెల్సిందే. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా చైనా పర్యటనకు వెళ్లారు. 
 
మూడు దేశాల్లో తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను మోడీ ముగించగా, చైనాలో ఐదు రోజుల పర్యటనను చంద్రబాబు పూర్తి చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటించగా, చైనా కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. 
 
ద్వైపాక్షిక సంబంధాలను నరేంద్ర మోడీ బలపరిస్తే, పారిశ్రామిక సంబంధాలను బాబు పటిష్ఠం చేశారు. ఢిల్లీ, పాలంలోని టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కి ప్రత్యక విమానంలో మోదీ చేరగా, ఆయనకు ఢిల్లీ నేతలు స్వాగతం పలికారు. హైదరాబాదులో బాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.

Share this Story:

Follow Webdunia telugu