Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ముస్లింలు అల్‌ఖైదా ట్యూన్లకు స్టెప్పులేయరు: మోడీ

భారత ముస్లింలు అల్‌ఖైదా ట్యూన్లకు స్టెప్పులేయరు: మోడీ
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (11:13 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు.

భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరనీ, భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అని అన్నారు.
 
‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు.
 
ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియోపై మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu