Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫార్చూన్ శక్తిమంతుల జాబితా: నరేంద్ర మోడీ, కైలాశ్ సత్యార్థిలకు చోటు!

ఫార్చూన్ శక్తిమంతుల జాబితా: నరేంద్ర మోడీ, కైలాశ్ సత్యార్థిలకు చోటు!
, శుక్రవారం, 27 మార్చి 2015 (19:26 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిలు ప్రపంచ శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చూన్ మ్యాగజైన్-2015 సంవత్సరానికిగానూ 50 మందితో ఓ జాబితా విడుదల చేసింది. అందులో మోడీ, సత్యార్థి ఇద్దరూ ఉన్నారు. ఇందులో మోడీకి ఐదో స్థానం లభించగా, సత్యార్థికి 28వ స్థానం దక్కించుకున్నారు.
 
ఇదే జాబితాల్లో యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తొలిస్థానంలో నిలిచారు. భారత నేత (మోడీ) ఎన్నికల్లో ఇచ్చిన తన హామీలను అమలుచేయడం ప్రారంభించారని, ప్రపంచంలో భారత్‌ను అగ్రపథాన నిలిపేందుకు తనదైన కృషిచేస్తున్నట్లు ఫార్చూన్ పేర్కింది. ఇక దేశీయంగా, అంతర్జాతీయంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండవసారి జాబితాలో చోటు దక్కించుకోలేక పోయినట్టు ఫార్చూన్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu